హైడ్రా రాకముందు అక్రమ నిర్మాణాలపై చాలా మంది నిశ్శబ్దంగా ఉండిపోయారు. కారణం.. వాటి వెనుక పెద్ద రాజకీయ నాయకుల మద్దతు ఉండటమే. మనకేం సంబంధం అని భావించి ఎవరూ ముందుకు రాలేదు. కానీ హైడ్రా ఏర్పడిన తర్వాత పరిస్థితి మారింది. ప్రజలు ధైర్యం చేసి అక్రమ కట్టడాలపై ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. అందుకు అనుగుణంగా హైడ్రా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ విధంగా సంస్థ ప్రజల మన్ననలను పొందడమే కాకుండా.. వారి నిబద్ధతను గమనించిన హైకోర్టు కూడా హైడ్రా పనిని అభినందించింది. దీంతో అక్రమ కట్టడాల నిర్మూలనలో హైడ్రా ఒక కీలక పాత్ర పోషిస్తోంది.