హైదరాబాద్లో ఒక వ్యాపారి వాట్సప్ పెట్టుబడి మోసంలో రూ. 64 లక్షలు పోగొట్టుకున్నాడు. 'నువామా వెల్త్ మేనేజ్మెంట్' పేరుతో పరిచయమైన మహిళ, ఆమె సహాయకుడు అతడిని నకిలీ వాట్సప్ గ్రూప్లో చేర్చి, నకిలీ లాభాలు చూపించి నమ్మించి దఫాల వారీగా పెట్టుబడులు పెట్టించారు. డబ్బులు వెనక్కి రాకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.