హైదరాబాద్లో వర్షాల వల్ల కలిగే వరద ముప్పును నివారించేందుకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నాలాల పూడికతీత పనులను ముమ్మరం చేశారు. వేసవిలోనే పనులు పూర్తి చేయాలని, ప్రవాహానికి అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. కాలనీ వాసులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి డీసిల్టింగ్ పనులను పర్యవేక్షించాలని.. ఎక్కడా నీరు నిలవకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కమిషనర్ వెల్లడించారు.