తిరుమల శ్రీవారు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాయి. కోట్లాదిమంది హిందువులకు తిరుమల శ్రీవారు పవిత్ర దైవం. అలాగే టీటీడీ కూడా అంతే ఫేమస్. అయితే టీటీడీ పేరుతో అక్కడక్కడా మోసాలు జరుగుతూ ఉంటాయి. తాజాగా టీటీడీ పేరుతో నకిలీ శ్రీనివాస కళ్యాణాలు జరుగుతున్నట్లు టీటీడీ గుర్తించింది. విదేశాల్లో ఇలా నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. తమ అనుమతి లేకుండా తమ పేరుతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్న టీటీడీ.. భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.