ప్రజలు కార్యాలయాల చుట్టూ ఏదైనా సమస్య కోసం రోజుల తరబడి తిరగకుండా.. వారు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఏపీ ప్రభుత్వం వివిధ పౌర సేవలను త్వరగా అందించడానికి ‘‘మన మిత్ర - ప్రజల చేతిలో ప్రభుత్వం’’ ద్వారా వాట్సాప్ సేవలను జనవరి 30న అదుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రెవెన్యూ, మున్సిపల్, ఎండోమెంట్ సేవలను వాట్సాప్లో అందజేయనున్నారు. టీటీడీ మినహా అన్ని దేవాలయాల సేవలను ఇందులో ఉంటాయని మంత్రి తెలిపారు.