heavy rain alert to telangana: తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బుధవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాక పిడుగులు పడే అవకాశం ఉన్నందున అన్నదాతలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్లో భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి.