ఖమ్మం జిల్లా చేగొమ్మలో గోదాంను ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. రైతు సంక్షేమ పథకాలను వివరించారు. ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతిని తెచ్చామని, సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తున్నామని పేర్కొన్నారు. ధాన్యం డబ్బులను వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో వేస్తున్నామని చెబుతూ.. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. పేదల సంక్షేమమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.