చేనేతలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఉచిత విద్యుత్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే మరమగ్గాలకు విద్యుత్ బిల్లులు వేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ చేనేత, జౌళి శాఖ కమిషనర్ స్పందించారు. ఉచిత విద్యుత్ పథకం కోసం ఇంటింటి సర్వే ఇటీవలే పూర్తి అయ్యిందని.. ఈ నేపథ్యంలో త్వరలోనే ఉచిత విద్యుత్ పథకం పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించినట్లు వివరించారు.