డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పెద్దమనసు చాటుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు అండగా నిలిచారు. పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లల కోసం తన వేతనాన్ని ఖర్చు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తన జీతం నుంచి పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి రూ.5000 చొప్పున ఇంటి వద్దనే పంపిణీ చేస్తామని ప్రకటించారు. మిగతా మొత్తాన్ని వారి బాగోగులకే ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. శుక్రవారం 32 మంది అనాథ పిల్లలకు పవన్ కళ్యాణ్ స్వయంగా సాయం అందించారు,