రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ తిరుపతి, సికింద్రాబాద్ విశాఖపట్నం, విశాఖపట్నం సికింద్రాబాద్, కాచిగూడ బెంగళూరు.. ఇలా పలు వందేభారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ చెన్నై మధ్యన కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నడుస్తున్న సంగతిీ తెలిసిందే. అయితే చెన్నై విజయవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును నరసాపురం వరకూ పొడిగించాలంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సీఎం రమేష్కు లేఖ రాశారు.