ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (రెండో శనివారం) రిజిస్ట్రేషన్ ఆఫీసులు పనిచేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రెండో శనివారం సెలవు రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం.. యధావిధిగా ఉదయం నుంచి సాయంత్రం వరకూ అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పనిచేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఏపీ ప్రభుత్వంన ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.