అడవుల రక్షణ, అటవీ సంపద అక్రమ రవాణా వంటి కార్యకలాపాలను అరికట్టడంలో ఫారెస్ట్ శాఖ అధికారులు విశేష కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రాణాలను సైతం కోల్పోతుంటారు. ఇలాంటి వారి త్యాగాలను స్మరించుకుంటూ ఏటా సెప్టెంబరు 11 తేదీన జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తుంటారు. ఈ అమరుల కుటుంబాల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం తాజాగా రూ. 5 కోట్ల నిధులు విడుదల చేసినట్టు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు.