తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం అయ్యాయి. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఇంటి నుంచి కాలు బయట పెట్టే అవకాశం లేకుండా పోయింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి వర్షాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారుల, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతే కాకుండా.. పురాతన ఇళ్లలో ఉన్నవారిని తక్షణమే ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.