చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్పై జరిగిన దాడిని ఖండిస్తూ, బాధ్యులెవరినీ విడిచిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరి 7న తన ఇంటిపై దాడి జరిగిందని, దాదాపు 20 మంది వ్యక్తులు ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడికి కారకులైన వారిపై సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలు వేస్తానని, చట్టపరంగా శిక్షించే వరకు పోరాడుతానని రంగరాజన్ తేల్చి చెప్పారు.