మే 5న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ నేపథ్యంలో రాచకొండ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆ రోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 11:50 గంటల వరకు భారీ వాహనాలపై నిషేధం ఉంటుంది. వివిధ ప్రాంతాల నుండి ఉప్పల్ వెళ్లే వాహనాల కోసం ట్రాఫిక్ మళ్లింపులు ఏర్పాటు చేశారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు కోరారు. మ్యాచ్ సమయానికి కనీసం ఒక గంట ముందుగానే తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.