తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపేవారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే 19,000 లైసెన్సులు రద్దయ్యాయని.. వాహనాల సామర్థ్య పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 17 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు (ఏటీసీ) ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.