హైదరాబాద్లో ఎన్ని పై వంతెనలు నిర్మించినా.. ట్రాఫిక్ మాత్రం పెరుగుతూనే ఉంది. ట్రాఫిక్ నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. కొత్త కొత్త వాహనాల కోనుగోళ్లు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో రోడ్లపై ఈ సంఖ్య పెరిగిపోవడంతో.. ట్రాఫిక్ కూడా అంతే పెరుగుతోంది. అయితే సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ ప్రాంతంలో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అక్కడి వాహనదారుల కాష్టాలు అంతా ఇంతా కాదు. వారికి ఈ కష్టాల నుంచి విముక్తి లభించినట్లే.