తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది, రహదారి ప్రమాదాల నివారణ కోసం వాహనాలకు రిఫ్లెక్టర్లు, రిఫ్లెక్టివ్ టేప్ల, రియర్ మార్కింగ్ ప్లేట్లు తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి వేళ ప్రమాదాలను తగ్గించడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఆటో రిక్షాలు మొదలుకొని, బైక్లు, కార్లు అన్ని రకాల వాహనాలకు వీటిని తప్పనిసరి చేసింది. ప్రజలు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేసింది.