ప్రేమ వివాహానికి అడ్డువస్తున్నారని కన్న తల్లిదండ్రులను కూతురే కిరాతకంగా హత్య చేసింది. నర్సుగా పనిచేస్తున్న సురేఖ.. తల్లిదండ్రులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడటంతో ఆమె కటకటాల పాలైంది. వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.