వికారాబాద్ జిల్లా వాల్యానాయక్ తండాలో ఒక వింత ఆచారం కొనసాగుతోంది. ఈ తండాకు కోడలిగా వచ్చిన మహిళలు జీవితాంతం మాంసాహారం తినకూడదు. కలరా వ్యాధి నుంచి తమను కాపాడిన సీతమ్మ, మరియమ్మ దేవతలకు మొక్కుకున్నందునే ఈ ఆచారం కొనసాగుతోందని గ్రామస్తులు నమ్ముతారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ వారు భక్తిశ్రద్ధలతో పాటిస్తున్నారు.