హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే బస్సు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. ఈ రూట్లో ప్రయాణించేవారికి ప్రత్యేక డిస్కౌంట్ సౌకర్యం కల్పించింది. రాజధాని ఏసీ బస్సుల్లో 8 శాతం, ఆపై సౌకర్యాలు ఉన్న బస్సుల్లో 10 శాతం డిస్కౌంట్ను ప్రకటించారు. ఈ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.