Snake Die After Bite Woman In Vizianagaram: ఓ విచిత్రమైన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓ పాము మహిళను కరిచిన తర్వాత చనిపోయింది. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా విజయనగరం జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఓ మహిళ బహిర్భూమికి వెళ్లిన సమయంలో పాము కరిచింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు వైద్యం అందించడంతో కోలుకున్నారు. అయితే ఆమెను కరిచిన పాము చనిపోయిందని స్థానికులు చెబుతున్నారు.