Vizianagaram Software Engineer Murder: విజయనగరం జిల్లాలో ఐటీ ఉద్యోగి హత్య సంచలనంగా మారింది. తాత ఊరికి వెళ్లిన యువకుడు తిరిగి వస్తూ తన ఊరి చివర శవమై కనిపించాడు. అతడ్ని హత్య చేసి రోడ్డుపై పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న ప్రసాద్.. ఈ నెల 5న సొంత ఊరికి వచ్చాడు. ఇంతలోనే ఈ ఘటన జరిగింది.. కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు.