విజయనగరం హెడ్‌మాస్టర్ గుంజీలు.. వీడియో వైరల్

1 month ago 4
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం చింతా రమణ గుంజీలు తీసిన స్వీయ శిక్ష వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యావర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ పాఠశాలలో 285 మంది విద్యార్థులుండగా, 15 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ఈనెల 11న విద్యార్థులను ఆవరణలోకి పిలిచిన హెచ్‌ఎం రమణ.. వారికి సాష్టాంగ నమస్కారం చేశారు. ‘మేము కొట్టలేం. తిట్టలేం. ఏమీ చేయలేం. మీ ఎదుట చేతగానివారిలా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. క్రమశిక్షణ తప్పితే ఇక మిమ్మల్ని శిక్షించబోం. మాకు మేమే శిక్ష అనుభవిస్తాం’ అంటూ వారి ఎదుటే గుంజీలు తీశారు. విద్యార్థులు ‘వద్దు సర్‌.. వద్దు సర్‌’ అంటున్నా, ఆయన గుంజీలు తీశారు. ఈ వీడియోపై మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’లో స్పందించారు. ‘చెప్పిన మాట వినడం లేదని విద్యార్థులను దండించకుండా, గుంజీలు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల ద్వారా నా దృష్టికి వచ్చింది. అందరం సమష్టిగా పనిచేసి, విద్యార్థులకు తగిన ప్రోత్సాహం అందిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తారు. విద్యా ప్రమాణాలు పెంచుదాం. పిల్లల విద్యా, శారీరక, మానసిక వికాసానికి కృషి చేసి, వారి భవితకు బంగారు బాటలు వేద్దాం’ అని పేర్కొన్నారు.
Read Entire Article