Scr On Stone Pelting: దేశవ్యాప్తంగా రైళ్లపై రాళ్ల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ హెచ్చరికలు జారీ చేశారు. రైల్వే ఆస్తులకు నష్టం కలిగిస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష తప్పదని ఆయన స్పష్టం చేశారు. రాళ్ల దాడులకు పాల్పడితే 139కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ ఏడాదిలో 100మందికిపైగా కేసులు నమోదు చేశామని, ఒకరికి జైలు శిక్ష, 11 మందికి జరిమానా విధించినట్లు తెలిపారు.