విజయవాడ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ఉడాన్ యాత్రీ కేఫ్ను ప్రారంభించారు. ఈ కేఫ్లో ఆహారం, పానీయాలు రూ.10 నుంచి అందుబాటులో ఉంటాయి, దీని వల్ల విమాన ప్రయాణికులకు ఖర్చుల భారం ముఖ్యంగా ఆహారం కోసం వెచ్చించే ఖర్చు తగ్గుతుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో విమాన ప్రయాణాన్ని సామాన్యులకు చేరువ చేసే లక్ష్యంతో ఈ పథకం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. తొలుత కోల్కతాలో ఈ ప్రాజెక్ట్ మొదలైంది.