Gannavaram Car Stuck In Flood Water: కృష్ణాజిల్లా గన్నవరం మండలం సావారిగూడెం వద్ద కారు వరద నీటిలో చిక్కింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరి ప్రాణాలను రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది రక్షించారు. వారిని నున్నకు చెందిన కైలే గౌతమ్, అతని తల్లి రమకుమారిగా గుర్తించారు. గౌతమ్ విజయవాడ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. సావారిగూడెం వద్ద కారు వరద నీటిలో చిక్కింది. రివర్స్ చేసేలోపు కారులోకి వరద నీరు చేరింది.. డోర్స్ లాక్ అవడంతో కారులోనే గౌతమ్, అతని తల్లి చిక్కుకుపోయారు. తమను కాపాడాలని గౌతమ్ లొకేషన్ పంపారు.. ఆ లొకేషన్ ఆధారంగా గన్నవరం తహశీల్దార్ సిబ్బందిని పంపించగా.. ఇద్దర్ని కాపాడారు.