బెజవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్లే భక్తులకు ఊరట నిచ్చేలా దుర్గ గుడి దేవస్థానం చర్యలు చేపడుతోంది. ఇంద్రకీలాద్రిపై భక్తులకు తాగునీటి సమస్యలు రాకుండా ఉండేందుకు కొత్తగా మరో రెండు ఆర్వో ప్లాంట్లను ప్రారంభించింది. దివిస్ లేబోరేటరీస్ సహకారంతో వీటిని ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు దివీస్ ముందుకు రాగా.. ఇప్పటి వరకూ నాలుగింటిని ఏర్పాటు చేశారు. మరొక ఆర్వో ప్లాంట్ త్వరలోనే ఏర్పాటు చేస్తామని దుర్గ గుడి ఈవో తెలిపారు.