కూటమి ప్రభుత్వం విజయవాడ ప్రజలకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. మళ్లీ 12 ఏళ్ల తర్వాత విజయవాడలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈక్రమంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు 'విజయవాడ ఉత్సవ్' పేరుతో కృష్ణా నది తీరంతో పాటుగా నగరంలోని మైదానాల్లో సంగీత, సినీ, సాంస్కృతిక వేడుకలు నిర్వహించనున్నారు. అలానే కృష్ణానదిలో పడవల పోటీలు, డ్రోన్ షో, ఎగ్జిబిషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయంటున్నారు.