Man Died With Chapati in Vijayawada: విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. చపాతీ ముక్క గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. చిట్టినగర్లోని కేఎల్ రావు నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి వేళ ప్రసాద్ అనే వ్యక్తి చపాతీ తినే సమయంలో.. అది కాస్తా గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక ప్రసాద్ ఇబ్బంది పడ్డారు. కుటుంబసభ్యులు గుర్తించి మంచినీళ్లు తాగించినా ప్రయోజనం లేకుండా పోయింది. అంబులెన్స్కు ఫోన్ చేయగా.. 108 వచ్చేలోగా ప్రసాద్ ప్రాణాలు కోల్పోయాడు.