కనకదుర్గమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని దుర్గగుడి దేవస్థానం అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దుర్గగుడి పాలకమండలి సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ భేటీలో 37లో అంశాల గురించి చర్చించిన పాలకమండలి సభ్యులు.. పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఈ క్రమంలోనే భక్తుల కోసం క్యూలైన్లలో టీవీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టీవీలు అందించేందుకు దాతలు ముందుకు వచ్చినట్లు ఛైర్మన్ రాధాకృష్ణ తెలిపారు.