Vijayawada Wife Ran Away: శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరోను సంప్రదించగా, కరుణావతి అనే మహిళను కొందరు పరిచయం చేశారు. ఆమెకు కట్నం కింద రూ.2 లక్షలు ఇచ్చాడు. పెళ్లయిన వారం రోజులకే కరుణావతి నాయనమ్మ బాగాలేదని చెప్పి విజయవాడ బస్టాండ్లో టాయిలెట్కు వెళ్ళి తిరిగి రాలేదు. పోలీసుల విచారణలో ఆమెకు ఇదివరకే పెళ్లయి ముగ్గురు పిల్లలున్నారని తేలింది.