విజయవాడలో మెట్రోను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ప్రాథమిక ప్రణాళికలను రూపొందించారు. క్షేత్రస్థాయిలో సర్వే చేసి మరీ.. ప్రణాళికలకు తుది రూపు తీసుకు వచ్చారు. అలాగే దీనిని ఆచరణలోకి తీసుకు వచ్చేందుకు గాను మెట్రో కార్పొరేషన్ అధికారులు రూ.205 కోట్లతో జనరల్ కన్సల్టింగ్ కంపెనీ కోసం టెండరును సైతం పిలిచారు. రెండు బోగీలతో రైళ్లను తాయరు చేయనున్నారు. అయితే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సేవలు కొనసాగించనున్నారు.