విజయవాడలో మరో కన్వెన్షన్ సెంటర్ అందుబాటులోకి రానుంది. బీఆర్ అంబేద్కర్ స్మృతివనంలో అంబేద్కర్ కళా ప్రాంగణం పేరుతో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్ ప్రారంభానికి సిద్ధమైంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అంబేద్కర్ జయంతి నేపథ్యంలో మంగళవారం రోజు చంద్రబాబు ఈ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభించనున్నట్లు తెలిసింది. రూ.90 కోట్లతో దీనిని నిర్మించారు.