Vijayawada Myanmar Nationals Arrested: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. విజయవాడలో ఎన్ఐఏ, పోలీసులు జరిపిన సోదాల్లో బంగ్లాదేశ్, మయన్మార్ యువకులు పట్టుబడ్డారు. పహల్గాం దాడి తర్వాత అక్రమ వలసదారులపై దృష్టి సారించారు. ఇదిలా ఉండగా, విజయనగరంలో ఉగ్రవాదులతో సంబంధాలున్న ఇద్దరిని అరెస్ట్ చేయడంతో కలకలం రేగింది. వారి వద్ద పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది.