విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సితార గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం మధ్యాహ్నం సమయంలో ఎగ్జిబిషన్లో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడుతున్నాయి. అయితే గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.