MLA క్వోటా MLC లు తెలంగాణలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు (గురువారం, మార్చి 13, 2025) అయిదుగురు అభ్యర్థులు ఎన్నికై సర్టిఫికేట్లు పొందారు. కాంగ్రెస్ నుండి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, CPI నుండి నెళ్ళికంటి సత్యం, BRS నుండి దాసోజు శ్రవణ్ MLC లుగా ఎన్నికయ్యారు. వారిలో నలుగురు నల్గొండ జిల్లా నుండి వచ్చారు.