మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలపై వైసీపీ స్పందించింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ చుట్టూ కోటరీ చేరిందంటూ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఆరోపణలకు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి కౌంటరిచ్చారు. వైఎస్ జగన్ చుట్టూ ఎలాంటి కోటరీ లేదని కాకాణి స్పష్టం చేశారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే విజయసాయిరెడ్డి ఈ ఆరోపణలు చేశారంటూ కాకాణి ఆరోపించారు. యువత పోరు, వైసీపీ ఆవిర్భావ దినోత్సవం నుంచి తప్పుదోవ పట్టించే ప్రయత్నమని మండిపడ్డారు.