మాజీ మంత్రి విడదల రజిని పల్నాడు జిల్లా పర్యటనలో ఉద్రిక్తతలు తలెత్తాయి. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం మానుకొండవారి పాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు విడదల రజిని వెళ్లారు. అయితే ఈ సమయంలో విడదల రజిని ప్రధాన అనుచరుడైన శ్రీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. కారులో ఉన్న శ్రీకాంత్ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా మాజీ మంత్రి విడదల రజిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, మాజీ మంత్రి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.