విదేశాల్లో భారీ జీతంతో ఉద్యోగాలు అంటూ మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకులకు నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి.. ఫేక్ ఆఫర్ లెటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ సంస్థను ఏర్పాటు చేసి.. పలువురు నిందితులు కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. వీరి చేతిలో మోసపోయిన కొందరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు.