విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 11 రకాల వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించింది. మంగళగిరి ఎయిమ్స్ నిపుణుల బృందం సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమం అమలు చేయనున్నారు. పరీక్షల అనంతరం విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తారు.