విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఒకట్రెండు రోజుల్లో డబ్బులు విడుదల చేస్తామన్న లోకేష్

1 year ago 23
ఏపీలోని విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ వినిపించారు. వచ్చే రెండు, మూడు రోజుల్లో ఆర్టీఎఫ్ స్కాలర్‌షిప్ నిధులు విడుదల చేస్తామని తెలిపారు. సోమవారం ఉండవల్లిలోని నారా లోకేష్ నివాసంలో కాలేజీ యాజమాన్యాల అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను కలిశారు. తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను క్యాలెండర్ ప్రకారం విడుదల చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆర్టీఎఫ్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి తొలివిడతలో ఇప్పటి వరకూరూ.571.96 కోట్లు విడుదల చేశామన్న నారా లోకేష్.. ఒకట్రెండు రోజుల్లో మిగతా మొత్తం విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
Read Entire Article