తెలంగాణ ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తోంది. విద్యార్థుల మేథాశక్తిని పెంచేందుకు ఉద్దేశించిన ఈ శిబిరాలు ఎంపిక చేసిన పాఠశాలల్లో మాత్రమే నిర్వహించనున్నారు. సుమారు 15 రోజుల పాటు సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు యోగా, ఆటలు, భాషా నైపుణ్యాలు, కళలు వంటి వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తారు. ఒక్కో పాఠశాలకు ప్రభుత్వం రూ.50 వేలు కేటాయించింది.