ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర వైభవంగా జరుగుతోంది. అమ్మవార్ల ఆగమనం, గద్దెలపై కొలువుదీరడం వంటి కీలక ఘట్టాల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ములుగు జిల్లా కలెక్టర్ రేపు (శుక్రవారం) జిల్లావ్యాప్తంగా సెలవు ప్రకటించారు.