తెలంగాణలోని విద్యార్థులు సెప్టెంబర్ 5 నుండి 7 వరకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. మిలాద్-ఉన్-నబీ, వినాయక నిమజ్జనం, ఆదివారం కావడంతో వరుస సెలవులు వచ్చాయి. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం సెప్టెంబర్ 6న జరుగుతుంది. దీంతో ఆ రోజున హైదరాబాద్ నగరంలో సెలవు దినం కానుంది.