అసలే ఎండా కాలం.. ఆపై విద్యుత్ ఛార్జీలు పెంపు.. ఇంకేమైనా ఉందా.. కరెంట్ బిల్లులు పేలిపోవూ..!! అచ్చంగా సామాన్యుల గుండెల్లో ఇదే భయం ఉండేది ఇన్ని రోజులు. గత కొంత కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచుతారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే.. ఈ వార్తలపై స్పందించిన విద్యుత్ సంస్థలు.. ఛార్జీల పెంపుపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపు లేనట్టేనని స్పష్టం చేయటంతో.. సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు.