Telangana ACB trap case: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చర్యలు వేగం అందుకున్నాయి. లంచం తీసుకున్నా, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినా వెంటనే ఏసీబీ ప్రత్యక్షం అవుతోంది. తాజాగా హైదరాబాద్లోని విద్యుత్ శాఖ ఏడీఈ అంబేడ్కర్పై సోదాల్లో బంధువుల ఇళ్లలో కోట్ల రూపాయల నగదు, ఖరీదైన భవనాలు, ప్లాట్లు వెలుగుచూశాయి. ఈ పరిణామం ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళన రేపింది. ఎప్పుడైనా ఏసీబీ తలుపు తడతుందేమో అన్న భయం వారిని వెంటాడుతోంది.