వినాయక నిమజ్జనం వేడుకలకు హాజరయ్యే భక్తులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు మెడికవర్ ఆస్పత్రి యాజమాన్యం ముందుకు వచ్చింది. అనుభవజ్ఞులైన వైద్యులు, నర్సులు అందుబాటులో ఉంటారు. అత్యవసరమైతే ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ సదుపాయం కూడా ఉంది. ఇదిలా ఉంటే నిమజ్జన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్సేన్ సాగర్ వద్దకు వచ్చి.. నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల క్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు..