కరాచీ బేకరీ 70 ఏళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా పేరుగాంచింది. అయితే, పహల్గాం ఉగ్రదాడి తర్వాత బేకరీ పేరు మార్చాలనే డిమాండ్లు పెరిగాయి. దీంతో కరాచీ బేకరీ వ్యవస్థాపకుల వారసులు తమకు మద్దతు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం, పోలీసులను కోరారు. తాము దేశ విభజన సమయంలో కరాచీ నుండి వచ్చి ఇక్కడ వ్యాపారం ప్రారంభించామని వారు తెలిపారు. తమది హైదరాబాద్ అని.. ఇది పాకిస్థాన్ బ్రాండ్ కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివరాలు..