హైదరాబాద్లో విమానయాన రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా అతిపెద్ద జీఎంఆర్ శాఫ్రాన్ ఎయిర్పార్క్ సెజ్ను ప్రారంభించారు. వర్చువల్గా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇది LEAP ఇంజిన్ల కోసం ప్రత్యేక MRO కేంద్రం. ఈ కొత్త సదుపాయం రాష్ట్ర ఏరోస్పేస్, రక్షణ రంగ వృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రూ.1300 కోట్లతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ వివరాలు..